కేపీహెచ్బీలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-01-09T14:30:49+05:30 IST
కేపీహెచ్బీలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని 20 మీటర్లు టిప్పర్ ఈడ్చుకెళ్లింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.