రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతుల దుర్మరణం
ABN , First Publish Date - 2021-04-13T06:32:52+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు.
గన్నవరం, ఏప్రిల్ 12 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి మితిమీరిన వేగంతో వచ్చిన ఒక క్రేన్ గూడవల్లి సెంటర్లో ఆగి ఉన్న మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో జక్కులనెక్కలం గ్రామానికి చెందిన రైతులు కాట్రు వెంకటేశ్వరరావు(68), మాకుల కోటేశ్వరరావు(60) ప్రాణాలను కోల్పోయారు. ఉప్పులూరు నుంచి వస్తూ, జాతీయ రహదారిని దాటి స్వగ్రామమైన జక్కులనెక్కలం వెళ్లేందుకు బైక్పై ఆగి ఉన్న వారిని, కేసరపల్లి వైపు నుంచి ఉప్పులూరు వైపు వెళుతున్న క్రేన్ వేగంగా వచ్చి ఢీకొనడంతో కాట్రు వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్టు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.