ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2020-09-19T12:31:10+05:30 IST

జిల్లా నందిగామ మండలం మునగ చెర్ల వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ

కృష్ణా: జిల్లా నందిగామ మండలం మునగ చెర్ల వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సును వేగంగా వస్తున్న  లారీ వెనుక నుండి ఢీకొనడంతో లారీ, బస్సు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఎస్‌వీకేడీటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన ఇద్దరిని రిస్క్ చేసి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-19T12:31:10+05:30 IST