ప్రకాశం జిల్లా చీరాల బైపాస్‌లో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-16T15:05:04+05:30 IST

ప్రకాశం జిల్లా చీరాలలో దసరా పండగ పూట విషాదం నెలకొంది...

ప్రకాశం జిల్లా చీరాల బైపాస్‌లో రోడ్డు ప్రమాదం

ఒంగోలు : ప్రకాశం జిల్లా చీరాలలో దసరా పండగ పూట విషాదం నెలకొంది. చీరాల బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానాన్ని లారీ డీకొన్నది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రవిచంద్(20), విల్సన్(18)లుగా గుర్తించారు. వీరిద్దరూ మరియమ్మ పేట, సాయికాలనీ వాసులుగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో సాయికాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-16T15:05:04+05:30 IST