సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2021-08-06T21:41:14+05:30 IST

సంగారెడ్డిజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పుల్కల్ మండలం చౌటకూర్ దగ్గర కారును లారీ ఢీకొట్టింది.

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

సంగారెడ్డి: సంగారెడ్డిజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పుల్కల్ మండలం చౌటకూర్ దగ్గర కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలున్నారు. మెదక్ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన అంబదాస్, పద్మ దంపతుల కుమారుడు వివేక్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివేక్‌ను సంగారెడ్డిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



Updated Date - 2021-08-06T21:41:14+05:30 IST