నందిగామలో రోడ్డు ప్రమాదం..11 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-11-10T12:34:40+05:30 IST

నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ నుండి విజయవాడ దుర్గగుడికి వెళ్తున్న

నందిగామలో రోడ్డు ప్రమాదం..11 మందికి గాయాలు

కృష్ణా: నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుమీద చనిపోయిన ఉన్న గేదేను తప్పించబోయి టాటా మ్యాజిక్ ఆటో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. జనగామ నుండి విజయవాడ దుర్గగుడికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-10T12:34:40+05:30 IST