రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-17T04:14:24+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ముంబాయి జాతీయ రహదారిపై జొన్నవాడ రోడ్డు కూడలిలో ఆదివారం లారీ కిందపడి ఓ యువకుడు మృతిచెం దాడు.

రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
లారీ చక్రాల దగ్గర మోటారుసైకిల్‌ పెంచలప్రసాద్‌ మృతదేహం

అందుబాటులో లేని 108 వాహనం 

వైద్యసేవల్లో ప్రభుత్వ వైద్యుల జాప్యం

చివరకు ప్రాణాలు విడిచిన వైనం


బుచ్చిరెడ్డిపాళెం/చేజర్ల, మే 16 : బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ముంబాయి జాతీయ రహదారిపై జొన్నవాడ రోడ్డు కూడలిలో ఆదివారం లారీ కిందపడి ఓ యువకుడు మృతిచెం దాడు. చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన జి.పెంచలప్రసాద్‌ (28) నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాళెం వైపు వస్తూ ప్రమాదవశాత్తు నెల్లూరు వైపు వెళుతున్న లారీ చక్రాల కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108లో తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా వాహనం అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత 20 నిమిషాల వరకు క్షతగాత్రుడి వద్దకు వైద్యసిబ్బందే రాలేదు. దీంతో స్థానికులు వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైద్యులు, సిబ్బంది క్షతగాత్రుడి వద్దకు చేరుకున్నారు. డాక్టర్‌ శ్వేత ఆలస్యంగా ఆక్సిజన్‌ అందించి వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే యువకుడు బతికేవాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం వరకు గ్రామంలో ఉన్న కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసఽభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-17T04:14:24+05:30 IST