తిరుపతిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-10T14:40:52+05:30 IST

మల్లవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు ఎన్‌హెచ్‌పై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే

తిరుపతిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

తిరుపతి: మల్లవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు ఎన్‌హెచ్‌పై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి తమిళనాడు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు తమిళనాడుకు చెందిన శరణ్య(30), మిథున్‌(12)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-07-10T14:40:52+05:30 IST