ఎద్దులబండిని ఽఢీకొన్న కారు : ముగ్గురికి గాయాలు
ABN , First Publish Date - 2021-10-19T03:34:20+05:30 IST
కలిగిరి-వింజమూరు రహదారిలో భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం వేకువజామున ఎద్దుల బండిని కారు ఢీకొంది.
కలిగిరి, అక్టోబరు 18: కలిగిరి-వింజమూరు రహదారిలో భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం వేకువజామున ఎద్దుల బండిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు, ఎద్దుల బండి యజమాని గాయపడ్డారు. వివరాల మేరకు.. దుత్తలూరు మండలం సోమలరేగడకు చెందిన సీహెచ్ కృష్ణారెడ్డి తమ పిల్లలను కాలేజీలో చేర్చడానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జిర్రావారిపాలెంకు చెందిన అలారి వెంకటయ్య పొలం పనుల నిమిత్తం ఎద్దుల బండిపై కలిగిరి వైపు పోతుండగా ఎదురుగా వస్తున్న ఆటో లైట్ల వెలుగులో కారు డ్రైవింగ్ చేసే వ్యక్తికి ముందు ఎద్దులబండి కనపడక ఢీకొట్టాడు. ఈ ఘటలో ఒక ఎద్దు కాలువలో పడిపోగా వెంకటయ్య గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో బెలూన్లు తెరుచుకోవడం వలన కృష్ణారెడ్డి దంపతులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కలిగిరి, నెల్లూరు వైద్యశాలకు తరలించారు.