విశాఖలో Road accident...త్రీ టౌన్ సీఐ మృతి

ABN , First Publish Date - 2021-11-25T12:23:13+05:30 IST

విశాఖలోని ఎండాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సిఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా..డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

విశాఖలో Road accident...త్రీ టౌన్ సీఐ మృతి

విశాఖ: విశాఖలోని ఎండాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సిఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా..డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్‎ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నైట్ రౌండ్స్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఎండాడ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో సీఐకు తలకు బలంగా తగలండంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఆదినారాయణ రావు, దిశా ఏసీపీ ప్రేమ్ కాజల్ సీఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‎కు తరలించారు.

Updated Date - 2021-11-25T12:23:13+05:30 IST