రోడ్డు ప్రమాదంలో మామాఅల్లుడు మృతి

ABN , First Publish Date - 2022-01-28T04:39:06+05:30 IST

రోడ్డు ప్రమాదంలో మామా అల్లుడు మృతి చెందారు. మండల కేంద్రం కొనకనమిట్ల పెట్రోల్‌ బంకు సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది.

రోడ్డు ప్రమాదంలో మామాఅల్లుడు మృతి
నరసింహారావు, రమేష్‌ మృతదేహాలు

కొనకనమిట్ల, జనవరి 27 : రోడ్డు ప్రమాదంలో మామా అల్లుడు మృతి చెందారు.  మండల కేంద్రం కొనకనమిట్ల పెట్రోల్‌ బంకు సమీపంలో  రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న  ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. అందిన వివరాల మేరకు.. మండలంలోని వాగుమడుగు గ్రామానికి చెందిన మామ నరసింహారావు, అల్లుడు రమేష్‌ తమ ద్విచక్రవాహనంపై కొనకనమిట్ల నుంచి స్వగ్రామం వాగుమడుగు గ్రామం వెళ్తున్నారు. ఎదురుగా మార్కాపురం నుంచి పొదిలి వైపు బుల్లెట్‌ వాహనం వస్తుంది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనండతో ఈప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈప్రమాదంలో వాగుమడుగు గ్రామానికి చెందిన నరసింహారావు (55 ) రమేష్‌ (28) అక్కడికక్కడే మృతి చెందారు. నరసింహారావుకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.  రమేష్‌కు నరసింహారావు పిల్లనిచ్చిన మామ.  రమేష్‌ స్వగ్రామం పామూరు కాగా సంక్రాంతి పండుగకు అత్తవారి ఊరు వాగుమడుగు వచ్చాడు. రమేష్‌కు భార్య సుబ్బమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. మామా అల్లుడు మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సోకసంద్రంలో మునిగి పోయారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికిగల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తొలుత లారీ తగలడంతో వీరిరువురు మృతి చెందారని బుల్లెట్‌ వాహనదారుడు తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. పోలీసులు విచారించడంతో బుల్లెట్‌ వాహనదారుడు నిజం బయట పెట్టాడని సీఐ తెలిపారు. బుల్లెట్‌దారుడిని విచారిస్తున్నట్లు పొదిలి సీఐ సుధాకర్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఫణిభూషణ్‌ తెలిపారు. 


Updated Date - 2022-01-28T04:39:06+05:30 IST