రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం
ABN , First Publish Date - 2021-10-28T04:33:14+05:30 IST
రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం చెం దాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం పట్టణంలోని చెరువు కట్టపై చోటుచేసుకుం ది.
మార్కాపురం, అక్టోబరు 27 : రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం చెం దాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం పట్టణంలోని చెరువు కట్టపై చోటుచేసుకుం ది. పోలీసుల కథనం మేరకు.. గుత్తికి చెం దిన బి.ఆంజనేయరెడ్డి దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దారవీడు మండలం కుంటలో బంధువుల ఇంటికి వెళ్లడానికి బుధవారం మార్కాపురంలో ఉదయం 8 గంటలకు రైలు దిగి ఆటోలో రైల్వేస్టేషన్ నుంచి పట్టణంలోకి వస్తున్నారు. చెరువు కట్టపై ఎదురుగా వస్తున్న సుధా గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఆటో ఆంజనేయరెడ్డి ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆంజనేయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై వై.నాగరాజు సందర్శించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి శవ పంచనామా నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు.