టీ దుకాణానికి వెళ్లిన driver.. కారు నడిపేందుకు యత్నించిన teacher మృతి

ABN , First Publish Date - 2021-10-20T12:36:26+05:30 IST

డ్రైవర్‌ టీ దుకాణానికి వెళ్లడంతో, తానే కారు నడిపేందుకు యత్నించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. ధర్మపురికి చెందిన అమరావతి(44) కృష్ణగిరి

టీ దుకాణానికి వెళ్లిన driver.. కారు నడిపేందుకు యత్నించిన teacher మృతి

పెరంబూర్‌(chennai): డ్రైవర్‌ టీ దుకాణానికి వెళ్లడంతో, తానే కారు నడిపేందుకు యత్నించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. ధర్మపురికి చెందిన అమరావతి(44) కృష్ణగిరి జిల్లా పోచం పల్లిలోని ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో పాఠశాలకు వెళ్లేందుకు మారుతి కారు కొనుగోలు చేసింది. తనకు డ్రైవింగ్‌ రాకపోవడంతో ఒక డ్రైవర్‌ను కూడా నియమించుకొని, ప్రతిరోజూ ధర్మపురి నుంచి కారులో పాఠశాలకు వచ్చేది.. సోమవారం సాయంత్రం తరగతులు ముగిసిన వెంటనే అమరావతి బయటకు రాగా, ఆ సమయంలో డ్రైవర్‌ టీ తాగేందుకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో, ఆమె స్వయంగా కారు నడిపేందుకు యత్నించగా ఊహించని విధంగా కారు పాఠశాల భవనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన టీచర్‌ను ధర్మపురి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు ఫలించక ఆమె మృతిచెందింది.

Updated Date - 2021-10-20T12:36:26+05:30 IST