ప్రభుత్వ బస్సును ఢీకొన్న Car
ABN , First Publish Date - 2021-12-24T16:56:36+05:30 IST
తిరుప్పూర్ జిల్లా గాంగేయం సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సేలంకు చెందిన 8 మంది స్నేహితులు
- ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు
పెరంబూర్(చెన్నై): తిరుప్పూర్ జిల్లా గాంగేయం సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సేలంకు చెందిన 8 మంది స్నేహితులు కారులో కొడైకెనాల్కు విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బోదియపాళం మార్గంలో వస్తున్న కారు సేలం నుంచి పళనికి వెళుతున్న ప్రభుత్వ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుకాగా, సెంథిల్కుమార్, రాజా, ప్రభు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకొని అక్కడకు చేరుకొన్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దట్టమైన మంచు కారణంగా ప్రమాదం సంభవించిందా? డ్రైవర్ మద్యం మత్తులో ఉండి కారు నడిపాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.