నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సీఎస్పురం వాసి మృతి
ABN , First Publish Date - 2021-05-05T06:40:35+05:30 IST
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎస్పురం వాసి మృతి చెందాడు.
సీఎస్పురం, మే 4 : నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎస్పురం వాసి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. సీఎస్పురం గ్రామానికి చెందిన షాలియాన్ రాజ్(45) నెల్లూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం నెల్లూరు నుంచి ద్విచక్రవాహనంపై సీఎస్పురం వస్తుండగా రామాపురం సమీపంలోని జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి బ్రిడ్జి కల్వర్టును ఢీకొని రోడ్డు పక్కన చెట్లలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య మండలంలోని చింతపూడు గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. అతని మృతితో విషాదం అలుముకుంది.