రహదారి గోతులమయం
ABN , First Publish Date - 2021-05-18T05:21:44+05:30 IST
నిడమర్రులో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్ల పై వున్న గోతులలో నీళ్లు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల రహదారు లన్నీ పూర్తి ధ్వంసం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురుగుతున్నారు.
వర్షంతో నిలిచిన నీరు
వాహనదారులకు ఇబ్బందులు
నిడమర్రు మే 17 : నిడమర్రులో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్ల పై వున్న గోతులలో నీళ్లు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల రహదారు లన్నీ పూర్తి ధ్వంసం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురుగుతున్నారు. గణపవరం, క్రొవ్విడి రహదారి పెదనిండ్ర కొలను రహదారులలో మోకాలు లోతు గొయ్యిలలో నీరు నిలిచిపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోల వారు తీవ్ర ఇబ్బందులకు పడుతు న్నారు. దూర ప్రయాణం చేసి రాత్రి సమయంలో ఇంటి చేరుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. వేసవికాలంలోనే పరిస్ధితి ఈ విధంగా ఉంటే రాబోయే వర్షాకాలంలో ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలో అంటూ ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిఽధులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నారు.