రోడ్డు పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-05-12T05:14:06+05:30 IST

కరోనా నేపథ్యంలో ఒడిశా అధికారులు ఆంధ్ర నుంచి ఆ రాష్ట్రంలోకి రాకపోకలు లేకుండా ఉండేందుకు మండల పరిధిలోని ఆల్తి గ్రామ సరిహద్దు వద్ద తవ్విన రోడ్డును మరలా పునరుద్ధరించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘సరిహద్దు కష్టాలు’ శీర్షికన వచ్చిన కథనానికి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్పందించారు. మంగళవారం ఆ ప్రాంతాన్ని ఆమె సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

రోడ్డు పునరుద్ధరణ
గుంతను కప్పుతున్న కూలీలు

ఒడిశా అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి 

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

కొత్తూరు, మే11: కరోనా నేపథ్యంలో ఒడిశా అధికారులు ఆంధ్ర నుంచి ఆ రాష్ట్రంలోకి రాకపోకలు లేకుండా ఉండేందుకు మండల పరిధిలోని ఆల్తి గ్రామ సరిహద్దు వద్ద తవ్విన రోడ్డును మరలా పునరుద్ధరించారు.   సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘సరిహద్దు కష్టాలు’ శీర్షికన వచ్చిన కథనానికి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్పందించారు. మంగళవారం ఆ ప్రాంతాన్ని ఆమె సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వెంటనే ఒడిశా అధికారులతో మాట్లాడి సరిహద్దు గ్రామాల ప్రజల ఇబ్బందులను వివరించారు. ఒడిశా అధికారులు సానుకూలంగా స్పందించి రోడ్డు గుంతను పూడ్చివేయించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.బాల, ఎస్‌ఐ సింహాచలం, ఆల్తి, కురిగాం సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-05-12T05:14:06+05:30 IST