21 వరకూ రోడ్ కం రైలు బ్రిడ్జి మూసివేత
ABN , First Publish Date - 2020-07-16T10:51:27+05:30 IST
రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బుధవారం నుంచి 21 వరకు వాహనాల రాకపోకలను నిలుపుదల చేశామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలి పారు.
కొవ్వూరు, జూలై 15 : రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బుధవారం నుంచి 21 వరకు వాహనాల రాకపోకలను నిలుపుదల చేశామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. పట్టణంలోని వ్యాపార సంస్థలను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరవాలన్నారు. వ్యాపారులు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సహకరించాలన్నారు. చిరువ్యాపారాలు, మాంసం విక్రయాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించక పోతే చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ ఎంవీవీ ఎస్ఎన్ మూర్తి హెచ్చరించారు.
నేటి నుంచి కిరాణా షాపుల సమయం కుదింపు
నిడదవోలు/తాళ్లపూడి, జూలై 15 : కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిరాణా షాపుల సమ యాన్ని కుదించినట్టు అసోసియేషన్ అధ్యక్షుడు పూస రపు వెంకటేశ్వరరావు తెలిపారు. నిడదవోలు పట్టణ పరిధిలో కిరాణా షాపులు గురువారం నుంచి ఉద యం 6 నుంచి 2 గంటల వరకే తెరిచి ఉంటాయని తెలిపారు.తాళ్లపూడిలో కిరాణా షాపులు స్వచ్ఛం దంగా మధ్యాహ్నం నుంచి మూసివేయాలని కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు షాపులు తెరుస్తారు.