రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలి

ABN , First Publish Date - 2022-01-29T04:38:39+05:30 IST

రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలి

రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలి
తుర్కగూడ ఎలిమినేడు రోడ్డు పనులను పరిశీలిస్తున్న ఎంపీపీ తదితరులు

ఇబ్రహీంపట్నంరూరల్‌, జనవరి 28: మండలంలోని సాహెబిగూడ , తుర్కగూడ, ఎలిమినేడు గ్రామాలకు చేపడుతున్న రోడ్డుపనులను కాంట్రాక్టర్‌ నాణ్యతతో చేపట్టాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన రోడ్డు పనులను సందర్శించారు. పనులలో కల్వర్టు ఏర్పాటులకు ఇసుక వాడకుండా డస్ట్‌వాడుతున్నారని, దీనివల్ల కల్వర్టులు త్వరగా కూలిపోతాయన్నారు. వెంటనే ఇసుకతో నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్‌ను కోరారు. అనంతరం పోచారం గ్రామంలో గ్రామపంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన కరోనా వాక్సినేషన్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో పోచారం ఉపసర్పంచ్‌ భగీరథ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T04:38:39+05:30 IST