రహదారుల గోతులు పూడ్చి జనసేన శ్రమదానం
ABN , First Publish Date - 2021-10-24T05:41:57+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో జనసేన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక తాడితోట జంక్షన్లో అధ్వానంగా ఉన్న రోడ్డు గుంతలను పూడ్చి శ్రమదానం చేశారు.
రాజమహేంద్రవరం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో జనసేన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక తాడితోట జంక్షన్లో అధ్వానంగా ఉన్న రోడ్డు గుంతలను పూడ్చి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపైఒకరు బురద చల్లుకుంటూ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఇది గమనించి తమ నేత పవన్కల్యాణ్ చేపట్టిన శ్రమదాన కార్యక్రమానికి ప్రతీ నియోజకవర్గంలోనూ అనూహ్య స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రోడ్ల సమస్యను పరిష్కరించాలన్నారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్లు అధ్వానం గా ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలన్నారు. అంతకుముందు దుర్గేష్, సత్యనారాయణ, పార్టీ సీనియర్ నేత వై.శ్రీనివాస్ జన సైనికులతో కలసి శ్రమదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు జామి సత్యనారాయణ, వైవీడీ ప్రసాద్, గెడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.