గిరిజన గ్రామాల రోడ్లు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-10-18T05:01:53+05:30 IST
గిరిజన గ్రామాల రోడ్లు పూర్తి చేయాలని ఏపీ రైతు గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
భామిని: గిరిజన గ్రామాల రోడ్లు పూర్తి చేయాలని ఏపీ రైతు గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఏబీ రోడ్డు నుంచి డోకులగూడ రహదారిని సందర్శించి రహదారిపై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సంఘ నాయకుడు కె.భాస్కరరావు మాట్లాడుతూ బండ్రసింగి, కోటకొండ మీదుగా మణిగ రహదారి, ఏబీ రోడ్డు నుంచి డోకులగూడ రహదారి పనులు నిలిచిపోవ డంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారని తెలిపారు.కార్యక్రమంలో గిరిజనులు సవర చిన్నారావు, ప్రసాద్, బాబూరావు పాల్గొన్నారు.