అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2020-05-28T11:11:24+05:30 IST

అంతర్‌జిల్లా దొంగను బుధవారం అరెస్టు చేసినట్టు భూపాల పల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు

అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

కాకతీయఖని, మే 27: అంతర్‌జిల్లా దొంగను బుధవారం అరెస్టు చేసినట్టు భూపాల పల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు. భూపాలపల్లిలో ఎస్సై సాంబమూర్తి వాహనాలు తనీఖీలు చేస్తుండగా  ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడని,  అదుపులోకి తీసు కొని విచారించగా అతని పేరు  రెవెల్లి జంపయ్య (40)గా గుర్తించామని తెలిపారు. వివిధ జిల్లాల్లో అతడు దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు జైలు శిక్ష కూడా అను భవించాడని అన్నారు. జంపయ్య వేధింపులు తాళలేక అతడి భార్య ఆత్మహత్య చేసు కుందని, ఈ కేసులో అతడు జైలుకు వెళ్లొచ్చాడని అన్నారు. తిరిగి జైలు నుంచి వచ్చిన జంపయ్య కొడుకు సంతో్‌ష(21)తో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడని వివరిం చారు. ఈఏడాది భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి, శ్యాంనగర్‌, బావుసింగ్‌పల్లి, వెంక్ర టావ్‌పల్లి గ్రామాల్లో జరిగిన దొంగతనాల్లో జంపయ్య నిందితుడని చెప్పారు. అత డిని అరెస్టు చేసి 11 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. 

Updated Date - 2020-05-28T11:11:24+05:30 IST