HYD : శ్రీశైలం పుణ్య క్షేత్రం వెళ్లొచ్చేసరికి బంజారాహిల్స్లో భారీ చోరీ..
ABN , First Publish Date - 2021-10-17T12:42:42+05:30 IST
దైవదర్శనానికి పుణ్యక్షేత్రం వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని వారు ఇళ్లు...
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : దైవదర్శనానికి పుణ్యక్షేత్రం వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని వారు ఇళ్లు దోచేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు -70 డీకే నగర్లో నివాసముండే ప్రవీణ్కుమార్ అగర్వాల్ వ్యాపారి. ఈ నెల 13న ఆయన కుటుంబంతో కలిసి దైవదర్శనానికని శ్రీశైలం వెళ్లారు. 14న రాత్రి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. అల్మారాలో ఉన్న బంగారు మంగళసూత్రం, మూడు గొలుసులు, ఐదు డైమాండ్ ఉంగరాలు, ఐదు బంగారు గాజులు, నెక్లెస్, చెవిదుద్దులు, 60వేల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.