మరో రెండ్రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2021-06-25T17:51:26+05:30 IST
మరో రెండు, మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకున్న ఓ ఇంట్లో దొంగలు ప
హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం : మరో రెండు, మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకున్న ఓ ఇంట్లో దొంగలు పడి నగదు, నగలు దోచుకెళ్లిన సంఘటన హుమాయున్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... హుమాయున్నగర్ బస్తీకి చెందిన షరీఫ్ తల్లి ఆషీయా పెళ్లి పత్రికలు పంచేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. అయితే అది గమనించిన దుండగులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న రూ.లక్ష 25 వేలు నగదు, మూడు తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. నగలు, నగదు దోచుకెళ్లారని ఆయన తెలిపారు. అయితే వెంటనే పొలీసులకు సమాచారం ఇచ్చామని ఆషీయా అన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.