లండన్ రైల్వే స్టేషన్లో కరోనాను హతమార్చే రోబోలు
ABN , First Publish Date - 2020-09-24T07:48:54+05:30 IST
యూకేలో కరోనాను హతమార్చే రోబోలను అధికారులు రంగంలోకి దించారు. లండన్లో
లండన్: యూకేలో కరోనాను హతమార్చే రోబోలను అధికారులు రంగంలోకి దించారు. లండన్లో నిత్యం రద్దీగా ఉండే సెయింట్ పాంక్రాస్ ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్లో ఈ సరికొత్త రోబోలను ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల రైల్వేస్టేషన్లలో సెయింట్ పాంక్రాస్ రైల్వేస్టేషన్ ఒకటి. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఈ రైల్వేస్టేషన్ బోరుమంటోంది. పైగా యూకేలో కొవిడ్-19 సెకండ్ వేవ్ మొదలుకావడంతో ప్రజలు రైల్వేస్టేషన్లో ప్రయాణించాలంటే ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రయాణీకులు తాము సురక్షితంగా ఉన్నామని భావించి నమ్మకంతో రైల్వేస్టేషన్కు వచ్చేలా ఈ రోబోలను ఏర్పాటు చేసినట్టు రైల్వేస్టేషన్ హెడ్ జే న్యూటన్ చెబుతున్నారు. ఈ రోబోలు అల్ట్రావయిలెట్ లైట్ సహాయంతో ఎటువంటి డిస్ఇన్ఫెక్టెంట్ లేకుండానే పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ రోబోలోని టెక్నాలజీ ద్వారా 100 శాతం క్రిములు, కరోనాతో కలిపి నేలపై, చుట్టుపక్కల గాల్లో ఉన్న అన్ని రకాల వైరస్లు నిమిషాల్లో చనిపోతాయని జే న్యూటన్ చెబుతున్నారు.