ధోనీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్

ABN , First Publish Date - 2021-04-18T11:11:28+05:30 IST

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యథిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు.

ధోనీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్

ముంబై: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యథిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ రికార్డు గతంలో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శనివారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచులో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచుతో మొత్తం ఐపీఎల్‌లో రోహిత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 217కు చేరింది. దీంతో 216 సిక్సర్లతో ఉన్న ధోనీ రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ జాబితాలో ఇప్పుడు తొలి స్థానాన్ని రోహిత్ ఆక్రమించగా.. 216 సిక్సర్లతో ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (201), సురేష్ రైనా (198) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Updated Date - 2021-04-18T11:11:28+05:30 IST