జీవితంలో ఇదే మొదటిసారి: రోహిత్

ABN , First Publish Date - 2020-08-06T22:58:51+05:30 IST

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎంతో ఆనందంగా ఉన్నాడు. తాను మునుపటికంటే ఇప్పడు ధృఢంగా ఉన్నానని చెప్తున్నాడు. వచ్చే నెల 19 నుంచి..

జీవితంలో ఇదే మొదటిసారి: రోహిత్

న్యూఢిల్లీ: హిట్‌‌మ్యాన్ రోహిత్ శర్మ ఎంతో ఆనందంగా ఉన్నాడు. తాను మునుపటికంటే ఇప్పడు ధృఢంగా ఉన్నానని చెప్తున్నాడు. వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. ఈ ఏడాది టోర్నీ తనకెంతో ప్రత్యేకమని, ఎన్నో రోజుల తరువాత మైదానంలో అడుగు పెట్టగలుగుతున్నానని చెప్పాడు. ‘నా క్రీడా జీవితంలో ఇంత సుదీర్ఘమైన విరామం ఎప్పుడూ తీసుకోలేదు. ఇంతకు ముందెన్నడూ ఇంత కాలం పాటు బ్యాట్ పట్టుకోకుండా ఉన్నది లేదు. దీంతో నా ఆటతీరు ఎలా మారిందో తెలియదు. ముఖ్యంగా దానిపై దృష్టి పెట్టాలి. అయితే శారీరకంగా మాత్రం ఇప్పటికీ పూర్తి దృఢంగా ఉన్నాను. టోర్నీకి చాలా సమయం ఉంది. దీంతో నా ఆటని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాని రోహిత్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ కెప్టెన్సీలో ఇప్పటికే ముంబై జట్టు 4 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. ఈ ఏడాది కూడా కప్పు గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

Updated Date - 2020-08-06T22:58:51+05:30 IST