ఏపీ సీఎం నివాస ప్రాంతంలో రౌడీ షీటర్ల ఆగడాలు!
ABN , First Publish Date - 2020-05-31T16:02:35+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాస ప్రాంతంలో రౌడీ షీటర్ల
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాస ప్రాంతంలో రౌడీ షీటర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.!. తాడేపల్లిలో ఇటీవల రౌడీషీటర్లు హల్ చల్ చేశారు. విజయవాడకు చెందిన రత్నశేఖర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యులను ఐదు లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు రాజశేఖర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ కాల్ ద్వారా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రౌడీషీటర్లు సాయి, రాంబాబు, శివలను అదుపులోకి తీసుకున్నారు. అయితే సీఎం నివాస ప్రాంతంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.