హత్య కేసులో రౌడీ షీటర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-05-06T07:47:49+05:30 IST

రొయ్యల వ్యాపారి హత్య కేసులో రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు భీమవరం టూటౌన్‌ సీఐ ఆర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

హత్య కేసులో రౌడీ షీటర్‌ అరెస్టు

భీమవరం క్రైం, మే 5 : రొయ్యల వ్యాపారి హత్య  కేసులో రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు భీమవరం టూటౌన్‌  సీఐ ఆర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి  11న భీమవరం బలుసుమూడికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండ రామారావును కిడ్నాప్‌ చేసి 12వ తేదీన హత్య చేసి ఖమ్మం జిల్లా జీడిమామిడితోటలో పడవేసిన సంఘటన తెలిసిందే. అయితే ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా వారిలో 8 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. తొమ్మిదో నిందితుడైన సాగర్లపేటకు చెందిన రౌడీ షీటర్‌ ఆవుల నాంచారయ్య (కొండ) తప్పించుకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టూటౌన్‌ సిఐ విజయ్‌కుమార్‌ కొండను అరెస్టు చేశారు. ఇప్పటికే 8 మంది జైల్లో ఉన్నట్టు సీఐ తెలిపారు. 


Updated Date - 2021-05-06T07:47:49+05:30 IST