రౌడీషీటర్ హత్య
ABN , First Publish Date - 2021-08-03T06:58:10+05:30 IST
నగరంలో రౌడీషీటర్ సికిందర్ బాషా (31)ను ఆదివా రం దారుణంగా హత్య చేశారు.
అనంతపురం క్రైం, ఆగస్టు 2: నగరంలో రౌడీషీటర్ సికిందర్ బాషా (31)ను ఆదివా రం దారుణంగా హత్య చేశారు. నగరంలోని రాజమ్మకాలనీకి చెందిన ఇతడు.. స్నేహితులు, డ్రైవర్లు షేక్షావలి, జిలాన్, మార్కెట్యార్డులో కూలి పనులు చేసుకునే చంద్రశేఖర్, అన్వర్ కలిసి తరచూ మద్యం సేవించేవారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా నగర శివారులోని గుత్తిరోడ్డు ప్రాంతంలో మద్యం తాగారు. ఇంటికి వచ్చే సమయంలో స్నేహితులతో రౌడీషీటర్ వాగ్వాదానికి దిగాడు. గుత్తిరోడ్డులోని లక్ష్మిరెడ్డి రైస్మిల్ సమీపంలోకి రాగానే.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. తాగిన మత్తులో ఉన్న స్నేహితులందరూ కలిసి బండరాయితో సికిందర్బాషాపై మోది, పరారయ్యారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని, రౌడీషీటర్ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని, ఐదేళ్ల కిందటే భర్తను వదిలేసి, వెళ్లిపోయింది. సికిందర్పై మూడు హత్య కేసులున్నాయి. అతడి హత్య తాగిన మత్తులో చేశారా..? ఇతర కారణాల నేపథ్యంలోనా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.