రౌడీషీటర్‌ ఆత్మహత్యాయత్నం?

ABN , First Publish Date - 2021-02-25T05:12:41+05:30 IST

శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ రౌడీషీటర్‌ ఆత్మహత్యకు యత్నించాడు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం నగరానికి చెందిన రౌడీషీటర్లకు వన్‌టౌన్‌ స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

రౌడీషీటర్‌ ఆత్మహత్యాయత్నం?

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 24 : శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ రౌడీషీటర్‌ ఆత్మహత్యకు యత్నించాడు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం నగరానికి చెందిన రౌడీషీటర్లకు వన్‌టౌన్‌ స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అనంతరం గొరకల ధన్‌రాజ్‌ అనే రౌడీషీటర్‌  మద్యం మత్తులో  పాతబస్టాండ్‌ వద్ద బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకుని అతడికి చికిత్స అందించినట్టు ఎస్‌ఐ తెలిపారు.  ధనరాజ్‌ సోదరుడు రాజారావుకి ఈ సమాచారం అందించగా, ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నట్టు ఎస్‌ఐ వెల్లడించారు.  ఇదిలాఉండగా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చిన తర్వాత ధన్‌రాజ్‌ను  స్టేషన్‌లోనే ఉంచి.. ఓ కేసు విషయంలో ప్రశ్నించినట్టు నగరంలో ప్రచారం జోరుగా సాగుతుంది. కొద్ది రోజులుగా పోలీసులు  ఇబ్బంది పెట్టడం వల్లే మనస్తాపానికి గురై ధన్‌రాజ్‌ స్టేషన్‌లోనే బ్లేడ్‌తో గొంతు కోసుకున్నట్టు చర్చిం చుకుంటున్నారు.  కలెక్టరేట్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించి... మళ్లీ ఆయన్ని స్టేషన్‌కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన విషయాలు ఎస్పీకి చేరడంతో విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.  

 

Updated Date - 2021-02-25T05:12:41+05:30 IST