అత్యధిక సంతానం ఉన్నవారికి భారీ నజరానా: మిజోరం మంత్రి

ABN , First Publish Date - 2021-06-22T05:17:05+05:30 IST

మిజో తెగ జనాభాను పెంచేందుకు మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా తాజాగా ఓ కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

అత్యధిక సంతానం ఉన్నవారికి భారీ నజరానా: మిజోరం మంత్రి

న్యూఢిల్లీ: మిజో తెగ జనాభాను పెంచేందుకు మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా తాజాగా ఓ కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరోఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత తరుణంలో మంత్రి ప్రకటన సంచలనంగా మారింది. పితృదినోత్సవం సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. లబ్ధిదారులు నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారు. ఇందుకు సంబంధించిన ఖర్చును మంత్రి తనయుడి ఆధ్వర్యంలో ఉన్న ఓ నిర్మాణ సంస్థ భరిస్తుందని తెలుస్తోంది. ‘‘వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభాలేదు. మిజోలు లాంటి చిన్న చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారింది’’ అని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-06-22T05:17:05+05:30 IST