వరసిద్ధుడికి రూ.10 లక్షల విరాళం
ABN , First Publish Date - 2021-08-03T06:45:02+05:30 IST
కాణిపాక వరసిద్ధుడి అన్నదాన కార్యక్రమానికి రూ.10లక్షలను కర్ణాటక కాంగ్రెస్ అధ్య క్షుడు డీకే శివకుమార్ విరాళంగా అందించారు.
ఐరాల(కాణిపాకం), ఆగస్టు 2: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకు న్నారు. ఆయనకు ఎమ్మెల్యేలు ఎమ్మెస్ బాబు, ఆరణి శ్రీనివాసులు తమ అనుచరులతో కలిసి అగరంపల్లె ఆర్చి వద్ద స్వాగతం పలికారు. ఆలయంలో ఏఈవో విద్యాసాగర్రెడ్డి దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా కాణిపాక ఆలయ ఆధ్వర్యంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రూ.10లక్షలను శివ కుమార్ విరాళంగా అందించారు. సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, నాయకులు మోహన్రెడ్డి, జగన్నాథరెడ్డి, రవిచంద్రారెడ్డి, కుమారరాజ, చరణ్కుమార్రెడ్డి, పృథ్వీరెడ్డి, ఎస్వీ కన్స్ట్రక్షన్స్ అధినేత గంగారపు గోపి, వీడీబీ హరిబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.