సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.2లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-04-21T07:15:06+05:30 IST

మండలంలోని సదర్శాపురం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం బాలాజీ జిన్నింగ్‌ మిల్లు యజమాని ఎగుమాటి రాంరెడ్డి మోత్కూరు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌కు రూ.2 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.2లక్షల విరాళం

 జిన్నింగ్‌ మిల్లు యజమాని ఉదారత

మోత్కూరు, ఏప్రిల్‌ 20: మండలంలోని సదర్శాపురం గ్రామంలో సీసీ కెమెరాల  ఏర్పాటు కోసం  బాలాజీ జిన్నింగ్‌ మిల్లు యజమాని ఎగుమాటి రాంరెడ్డి మోత్కూరు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌కు రూ.2 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ మాట్లాడుతూ నేరాల అదుపునకు, ప్రమాదాలు, దొంగ తనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతో దోహద పడుతాయన్నారు.  మిగతా గ్రామాల్లో కూడా దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.


Updated Date - 2021-04-21T07:15:06+05:30 IST