సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.2లక్షల విరాళం
ABN , First Publish Date - 2021-04-21T07:15:06+05:30 IST
మండలంలోని సదర్శాపురం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం బాలాజీ జిన్నింగ్ మిల్లు యజమాని ఎగుమాటి రాంరెడ్డి మోత్కూరు ఎస్ఐ ఉదయ్కిరణ్కు రూ.2 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు.
జిన్నింగ్ మిల్లు యజమాని ఉదారత
మోత్కూరు, ఏప్రిల్ 20: మండలంలోని సదర్శాపురం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం బాలాజీ జిన్నింగ్ మిల్లు యజమాని ఎగుమాటి రాంరెడ్డి మోత్కూరు ఎస్ఐ ఉదయ్కిరణ్కు రూ.2 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సంద ర్భంగా ఎస్ఐ ఉదయ్కిరణ్ మాట్లాడుతూ నేరాల అదుపునకు, ప్రమాదాలు, దొంగ తనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతో దోహద పడుతాయన్నారు. మిగతా గ్రామాల్లో కూడా దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.