రహదారి విస్తరణకు రూ. 7.80 కోట్లు
ABN , First Publish Date - 2021-04-20T05:36:32+05:30 IST
జిల్లా కేంద్రంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చమన్-దాయర రహదారి విస్తరణ పనులకు మోక్షం లభించనుంది.
ప్రతిపాదనలు పంపిన ఎమ్మెల్యే పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 19: జిల్లా కేంద్రంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చమన్-దాయర రహదారి విస్తరణ పనులకు మోక్షం లభించనుంది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చొరవ తీసుకుని రాందాస్ చౌరస్తా నుంచి దాయర వరకు 50 ఫీట్ల రోడ్డు విస్తరణ చేసేందుకు అంచానాలు తయారు చేయించారు. రహదారి విస్తరణకు రూ.7.80 కోట్లు అవసరమవుతాయని ఆర్అండ్బీ అధికారులు నివేదికను అందజేశారు. ఇటివల సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యే రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో సోమవారం సర్వే ప్రారంభించారు. 50 ఫీట్ల రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేశారు.