బాప్రే... రూ. 8.5 లక్షల కోట్లు... అలీబాబాకు నష్టం...
ABN , First Publish Date - 2021-01-04T02:06:36+05:30 IST
చైనా కుబేరుడు జాక్ మా నేతృత్వంలోని అలీబాబాకు వరుస షాక్లు తగులుతున్నాయి. జాక్ మాతో వ్యాపార సామ్రాజ్యంపై గత కొద్ది రోజులుగా అధికారులు కొరడా ఝళిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాప్తునకు కూడా ఆదేశించాయి.
బీజింగ్: చైనా కుబేరుడు జాక్ మా నేతృత్వంలోని అలీబాబాకు వరుస షాక్లు తగులుతున్నాయి. జాక్ మాతో వ్యాపార సామ్రాజ్యంపై గత కొద్ది రోజులుగా అధికారులు కొరడా ఝళిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాప్తునకు కూడా ఆదేశించాయి.
ఇటీవల యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపై దర్యాప్తు జరుగుతోన్న విషయం తెలిసిందే. వివిధ కారణాల నేపధ్యంలో... యాంట్ గ్రూప్ అతిపెద్ద ఐపిఒకు చెక్ చెప్పారు. అంతేకాకుండా... చైనా బ్యాంకులపై జాక్ మా చేసిన వ్యాఖ్యలు కూడా అలీబాబాపై ప్రభావం చూపాయి. యాంట్ ఫైనాన్షియల్ ఐపీఒ అంశం అలీబాబా సంపదను కరిగిస్తూ వస్తోంది.
వివిధ కారణాలు నేపధ్యంలో యాంట్ ఫైనాన్షియల్ కు చెందిన 10 బిలియన్ డాలర్ల ఐపీఓ ను చైనా అధికారులు నిలిపివేశారు. కంపెనీ విలువ ఈ క్రమంలో భారీగా నష్టపోయింది. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో అలీబాబా సంపద 116 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు రూ. 8.5లక్షల కోట్లు). మేర తుడిచిపెట్టుకుపోయింది. అలీబాబా అనుబంధ సంస్థపై యాంటీట్రస్ట్ దర్యాప్తు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో... న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీలో అలీబాబా షేరు దాదాపు పదిహేను శాతం పడిపోయింది. ఈ దర్యాప్తు తర్వాత జరిమానా విధిస్తారనే ఆందోళన నేపధ్యంలో... షేర్లను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు.
అలీబాబాపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది.
కంపెనీ 10 బిలియన్ డాలర్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలును ప్రతిపాదించింది. మొదట 6 బిలియన్ డాలర్ల బైబ్యాక్ను, ఆ తర్వాత 10 బిలియన్ డాలర్లకు పెంచేందుకు అలీబాబా బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో... వచ్చే ఏడాది వరకు బైబ్యాక్ చేపట్టనుంది.
కాగా... అలీబాబా ఆధిపత్య ధోరణిపై దర్యాప్తు చేపట్టేందుకు నియంత్రణ సంస్థలు, మొగ్గు చూపడంతో కౌంటర్లో విక్రయాలు కొనసాగాయి. గతంలో బ్యాంకులపై జాక్ మా వ్యాఖ్యలు దూమారం రేపిన నేపధ్యంలో... షేర్లు పడిపోయిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ పరిణామాల నేపధ్యంలో అలీబాబా కు జరిగిన నష్టం రూ. 8.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.