రూ.9.53 లక్షలు వెలుగు నిధులు దుర్వినియోగం

ABN , First Publish Date - 2021-10-17T05:15:23+05:30 IST

మండలంలోని అరవీడు గ్రామానికి చెందిన వెలుగు వీవోఏ యానిమేటర్‌ సురేంద్రపై రూ.9.53 లక్షలు వెలుగు, సీఐఎఫ్‌, స్త్రీనిధి పలు ఖాతాల నుంచి దుర్వినియోగం చేశారని పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెలుగు స్త్రీనిధి మేనేజర్‌ నరసింహులు పేర్కొన్నారు.

రూ.9.53 లక్షలు వెలుగు నిధులు దుర్వినియోగం

గాలివీడు, అక్టోబరు16: మండలంలోని అరవీడు గ్రామానికి చెందిన వెలుగు వీవోఏ యానిమేటర్‌ సురేంద్రపై రూ.9.53 లక్షలు వెలుగు, సీఐఎఫ్‌, స్త్రీనిధి పలు ఖాతాల నుంచి దుర్వినియోగం చేశారని పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెలుగు స్త్రీనిధి మేనేజర్‌ నరసింహులు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో వెలుగు ఏపీ వేణుమాధవ్‌, ఏపీయం పెద్దరెడ్డెయ్యలతో కలిసి యానిమేటర్‌పై ఫిర్యాదు ఇచ్చామన్నారు. యానిమేట ర్‌ స్త్రీనిధి తదితర వెలుగు నిధుల ఖాతాల నుంచి సొంత కుటుంబ సభ్యుల ద్వారా ఖాతాలో నుంచి రూ.16 లక్షలు తీసుకుని  చెల్లించకుండా తప్పించుకోవడంతో జిల్లా అధికారుల ఆదేశానుసారం రూ.9.53 లక్షలు చెల్లింపులో జాప్యంపై ఎస్‌ఐకి ఫిర్యా దు చేశామన్నారు. ఇప్పటికే యానిమేటర్‌ను విధుల నుంచి తప్పించడం జరిగిందన్నారు.  


Updated Date - 2021-10-17T05:15:23+05:30 IST