ప్రగతి భవన్ను బహుజన భవన్గా మారుస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ABN , First Publish Date - 2021-08-25T01:40:05+05:30 IST
రాబోయేది బహుజనుల రాజ్యమేనని.. ఈ రాజ్యంలో ప్రగతి భవన్ పేరును బహుజన భవన్గా మారుస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
హన్మకొండ: రాబోయేది బహుజనుల రాజ్యమేనని.. ఈ రాజ్యంలో ప్రగతిభవన్ పేరును బహుజన భవన్గా మారుస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులో బీఎస్పీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు, సంచార జాతులను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. దళితులకు చదువు రాదని ఓ ఎమ్మెల్యే అవమానపరిచారని కానీ మా బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నారని వారే పాలకులు కాబోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.