రేషన్ కార్డున్న ప్రతి వారికీ రూ.1000
ABN , First Publish Date - 2020-04-08T09:40:27+05:30 IST
రాష్ట్రంలో బియ్యం కార్డులు ఉన్న 1.33 కోట్ల కుటుంబాలతో పాటు రేషన్ తీసుకున్న కుటుంబాలన్నింటికీ రూ.వెయ్యి ఆర్థిక సాయం అందజేయనున్నట్లు విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బియ్యం కార్డులు ఉన్న 1.33 కోట్ల కుటుంబాలతో పాటు రేషన్ తీసుకున్న కుటుంబాలన్నింటికీ రూ.వెయ్యి ఆర్థిక సాయం అందజేయనున్నట్లు విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బియ్యం కార్డులు ఉన్న కుటుంబాలకు ఈ నెల 4 నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారని, కానీ, రేషన్ తీసుకున్న అందరినీ పరిశీలించి, అర్హులకు రూ.1000 ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు.