మహాశివరాత్రికి 751 ఆర్టీసీ బస్సులు
ABN , First Publish Date - 2021-03-03T05:48:07+05:30 IST
ఈనెల 11న మహా శివరాత్రి పురస్కరించుకొని ఆర్టీసీ అదనపు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా రీజియన్ వ్యాప్తంగా 751 సర్వీసులను సిద్ధం చేస్తున్నట్లు రీజనల్ మేనేజర్ ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు.
గుంటూరు, మార్చి 2: ఈ నెల 11న మహా శివరాత్రి పురస్కరించుకొని ఆర్టీసీ అదనపు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా రీజియన్ వ్యాప్తంగా 751 సర్వీసులను సిద్ధం చేస్తున్నట్లు రీజనల్ మేనేజర్ ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లోని తిక్కన సమావేశ మందిరంలో విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ టి.శోభామంజరి, ఎల్.మధుసూదనరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రాజశేఖర్ల నేతృత్వంలో సమావేశం జరిగింది. కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 275, చిలకలూరిపేట డిపో నుంచి 120 సర్వీసులు, వినుకొండ డిపో నుంచి 35, మొత్తం 430 బస్సులు ఆరు క్యాంపులుగా విభజించామని పేర్కొన్నారు. వీటితో పాటు అమరావతికి 33, సత్రశాలకు 20, క్వారీకి 45, గోవాడకు 58, మన్నేపల్లికి 5, దైదకు 4, త్రిపురాంతకానికి 5, అరసవల్లికి 2, తేరాలకు 2, శ్రీశైలానికి 72, నరసరావుపేటకు 75 ప్రత్యే సర్వీసులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రహ్మానందరెడ్డి డిప్యూటీ సీటీఎంలు వై.రాజశేఖర్, ఎన్.శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ శరత్బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.