చెరువులోకి దూసుకెళ్లిన బస్సు
ABN , First Publish Date - 2021-11-07T17:09:40+05:30 IST
కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెరువులో పడింది. తాలూకాలోని యల్లంపల్లి చెరువులో బస్సు పడగా డ్రైవర్, కండక్టర్ సహా ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం ఉదయం కేఏ40 ఎఫ్ 701 ఆర్టీసీ బస్సు
- పలువురికి గాయాలు
బాగేపల్లి(Karnataka): కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెరువులో పడింది. తాలూకాలోని యల్లంపల్లి చెరువులో బస్సు పడగా డ్రైవర్, కండక్టర్ సహా ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం ఉదయం కేఏ40 ఎఫ్ 701 ఆర్టీసీ బస్సు బాగేపల్లి నుంచి చింతామణివైపు చెరువుకట్టపై వస్తుండగా ఎదురుగా వస్తున్న టెంపోకు సైడ్ ఇవ్వబోయి అదుపుతప్పింది. బస్సులో 16 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ సీఎన్ సత్యనారాయణరెడ్డి, వైద్యులు సిబ్బంది ప్రథమచికిత్స అందించారు. ఎస్పీ జీకే మిథున్కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఆర్ నాగరాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేఎస్ ఆర్టీసీ జిల్లా విభాగ కార్యాలయ భద్రతా అధికారులు, మేనేజర్ తదితరులు పరిశీలించారు. డిపో విభాగం మేనేజర్ ఎం మన్మథ్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.