రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-04T04:02:38+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఆర్టీ సీ బస్సు డ్రైవర్‌ దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ దుర్మరణం
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

భూత్పూర్‌, డిసెంబరు 3: రోడ్డు ప్రమాదంలో ఆర్టీ సీ బస్సు డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మ హబూబ్‌నగర్‌ జిల్లా భూ త్పూర్‌ 44వ జాతీయ రహ దారిపై శుక్రవారం తెల్లవా రుజామున చోటు చేసుకుం ది. భూత్పూర్‌ ఎస్సై భాస్క ర్‌రెడ్డి కథనం ప్రకారం వివ రాలిలా ఉన్నాయి. ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లా పొద్దుటూరు ఆర్టీసీ డిపో కు చెందిన బస్సు గురువారం సాయంత్రం హైద రాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయి తే భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌ గ్రామ స మీపంలో ముందు వెళుతున్న లారీ ఎడమవైపు నుంచి సడన్‌గా కుడివైపునకు రావడంతో బస్సు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు రెండవ డ్రైవర్‌ రూబేను(54) బస్సులోంచి ఎగిరి కిందకు పడిపోయి దుర్మరణం చెందాడు. బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. బస్సు మొదటి డ్రైవర్‌ ఎస్‌కే.భాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి  తెలిపారు.

Updated Date - 2021-12-04T04:02:38+05:30 IST