RTC Conductor కుటుంబానికి ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-10-20T14:50:39+05:30 IST
ఆర్టీసీ కాచిగూడ డిపోలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన పి.నరసింహులు కుటుంబానికి డిపో సిబ్బంది విరాళాలు సేకరించి రూ.50వేల ఆర్థిక
హైదరాబాద్/బర్కత్పుర: ఆర్టీసీ కాచిగూడ డిపోలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన పి.నరసింహులు కుటుంబానికి డిపో సిబ్బంది విరాళాలు సేకరించి రూ.50వేల ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం కాచిగూడ డిపోలో నరసింహులు కుటుంబానికి హైదరాబాద్ రీజినల్ మేనేజర్ సీ.హెచ్.వెంకన్న ఈ సహాయం అందజేశారు. కండక్టర్ నరసింహకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీవీఎం అపర్ణ కల్యాణి, డిపో మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.