ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.40 లక్షలు
ABN , First Publish Date - 2021-06-23T05:55:24+05:30 IST
ప్రజా రవాణాశాఖ (పీటీడీ/ఆర్టీసీ) విశాఖ రీజియన్ రోజువారీ ఆదాయం రూ.40 లక్షలకు చేరింది.
ద్వారకాబస్స్టేషన్, జూన్ 22: ప్రజా రవాణాశాఖ (పీటీడీ/ఆర్టీసీ) విశాఖ రీజియన్ రోజువారీ ఆదాయం రూ.40 లక్షలకు చేరింది. మంగళవారం 600 బస్సులు నడిపి ఈ ఆదాయం వచ్చినట్టు అధికారులు లెక్కలు కట్టారు కర్ఫ్యూ నిబంధనలకు సడలింపు ఇవ్వడంతో సర్వీసులు పెంచారు. ఇవి 58 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడిచాయి. ప్రయాణికుల డిమాండ్ మేరకు బుధవారం బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.