రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2021-03-03T05:41:51+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి
పరిగి: పరిగి ఆర్టీసి డిపోలో మెకానిక్గా పని చేస్తున్న రంగంపల్లి గ్రామానికి చెందిన కిష్టమోని సత్తయ్య మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. డిపోలో విధులు ముగించుకుని తన బైక్పై ఇంటికి వెళుతుండగా రూఫ్ఖాన్పేట్ శివారులో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. దీంతో సత్తయ్య తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కొడుకులు, భార్య ఉన్నారు. డీఎం బద్రినారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.