రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2021-10-18T05:41:26+05:30 IST

మండలంలోని కె.ఎర్రగుడి గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యో గి రెడ్డిశేఖర్‌రెడ్డి (35) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి
మృతి చెందిన రెడ్డిశేఖర్‌రెడ్డి

చక్రాయపేట, అక్టోబరు 17: మండలంలోని కె.ఎర్రగుడి గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యో గి రెడ్డిశేఖర్‌రెడ్డి (35) మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి చక్రాయపేట ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి వివరాలు వెల్లడించారు. రెడ్డిశేఖర్‌రెడ్డి తన అత్తగారింటికి భార్య పవిత్రతో కలిసి శనివారం కడప నుంచి అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం వెలిచెలమల గ్రామం వెళుతున్నారు. కె.ఎర్రగుడి గ్రామ సమీపాన వంక దాటుతుడగా ఆ వంకలో పాచి కట్టి ఉండడం, కుక్క అడ్డురావడంతో బైకు అదుపుతప్పి భార్య భర్త కిందపడ్డారు. రెడ్డి శేఖర్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా, పవిత్రకు స్వల్ప గాయాలయ్యాయి. పవిత్ర తన తల్లిదండ్రులకు  సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి రెడ్డిశేఖర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పవిత్ర అక్కడే చికిత్స పొందుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెడ్డిశేఖర్‌రెడ్డి కడపలో నివాసం ఉంటూ గ్యారేజీలో ఆర్టీసీ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాడు. అనంతపురంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.  

Updated Date - 2021-10-18T05:41:26+05:30 IST