ఆర్టీసీ ఉద్యోగులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించండి
ABN , First Publish Date - 2021-05-14T15:01:56+05:30 IST
ఆర్టీసీ (పీటీడీ) ఉద్యోగులను..
ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర నేతలు
విజయవాడ: ఆర్టీసీ (పీటీడీ) ఉద్యోగులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి ప్రతి ఉద్యోగికి వ్యాక్సిన్ ప్రక్రియ వెంట నే ప్రారంభించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు వై.వి.రావు, పి.దామోదరరావు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వేళ ప్రాణాలను లెక్క చేయకుండా ఆర్టీసీ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలున్నా నేటికీ ఆఫీస్ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్ ఇవ్వకపోవ డం, కరోనా బారిన పడిన ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రత్యేక సెల వులు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. కొవిడ్తో మరణిం చిన ఉద్యోగి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 50లక్షలు, తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు.