నేటి నుంచి ఆర్టీసీ అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-21T06:49:34+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సోమవారం నుం చి అంతరాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్న నిజామాబాద్ రీజనల్ మేనేజర్ సుధాపర్మిల ఆదివారం తెలిపారు.
సుభాష్నగర్, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సోమవారం నుం చి అంతరాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్న నిజామాబాద్ రీజనల్ మేనేజర్ సుధాపర్మిల ఆదివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్ర యాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆంధ్రప్రదేశ్ లాక్డౌన్ ను దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్రం నిబంధ నలను అనుసరించి ఉదయం 5 నుంచి సాయంత్రం 7గంటల వరకు బస్సులు నడుపుతామని, బెంగుళూరు మినహా వివిధ ప్రాంతాలకు యధావిధిగా బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని గమ్యస్థానా లకు ప్రయాణికులను చేరవేసేందుకు లాక్డౌన్ నిబంధనలను అనుసరించి మంగళవారం నుంచి బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.