దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్న సజ్జనార్

ABN , First Publish Date - 2021-10-04T16:05:26+05:30 IST

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు.

దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్న సజ్జనార్

హైదరాబాద్: దిశ కమిషన్ విచారణను వేగవంతం చేస్తోంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. దిశ ఎన్ కౌంటర్ కేసులో అప్పుడు సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్నారు. దిశ విచారణకు హాజరు కావాలని జ్యుడీషియల్  కమిషన్ సమన్లు జారీ చేసింది. నలుగురు నిందితుల ఎన్ కౌంటర్‌పై సజ్జనార్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ నమోదు చేయనుంది. ఇప్పటికే ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలను, పలువురు సాక్ష్యుల వాగ్మూలాలను కమిషన్ నమోదు చేసింది. కాగా ఇవాళ సజ్జనార్ విచారణ కీలకంగా మారనుంది.

Updated Date - 2021-10-04T16:05:26+05:30 IST