ఆర్టీసీ సిబ్బంది నిజాయతీ

ABN , First Publish Date - 2020-06-03T10:17:57+05:30 IST

బస్సులో దొరికిన రూ. 20,500 నగదును ప్రయాణికునికి అప్పగించి తమ నిజాయతీని మరోసారి నిరూపించుకున్నారు

ఆర్టీసీ సిబ్బంది నిజాయతీ

 పోగొట్టుకున్న నగదును ప్రయాణికునికి అప్పగించిన సిబ్బంది


విజయనగరం టౌన్‌, జూన్‌ 2: బస్సులో దొరికిన రూ. 20,500 నగదును ప్రయాణికునికి అప్పగించి తమ నిజాయతీని మరోసారి నిరూపించుకున్నారు ఆర్టీసీ సిబ్బంది. వివరాల్లోకి వెళ్లితే.. రామభద్రపురం మండలానికి చెందిన సంగిరెడ్డి సింహాచలం తన కుమార్తెను విశాఖపట్టణంలోని తన ఇంటికి తీసుకెళ్లేందుకు మంగళవారం రామభద్రపురం-విజయనగరం ఆర్టీసీ బస్సు ఎక్కాడు. విజయనగరం కాంప్లెక్స్‌లో బస్సు దిగి విశాఖపట్టణం వెళ్లే బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో బస్సులో రూ. 20,500 మర్చిపోయాడు. అక్కడే ఉన్న స్టేషన్‌ మేనేజర్‌ శ్రీనివాసరాజు, సెక్యూరిటీ హెడ్‌కానిస్టేబుల్‌ సత్యంలు బస్సులో ఉన్న కవరును గుర్తించారు. ఆ నగదును భద్రపరిచి సింహాచలంకు అందించారు. ఆయన ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-06-03T10:17:57+05:30 IST